కవిత నెం :59
ప్రకృతి వైపరీత్యాలు
***************************
ప్రకృతి మనకు సహజంగా లభించిన సంపదైతే
ఆ ప్రకృతి ప్రళయాగ్నికి మానవ తప్పిదాలు ఎన్నో
ప్రకృతి ప్రకంపిస్తుంది సునామీగా ,తుఫాన్ గా, భూకంపంగా
ప్రజల ఆర్తనాదాలు ఆందోళనగా ,అందకారంగా
మండే ఎండలు ,అకాల వరదలు ,బీడు భూములు
ఎవ్వరు రాసుకున్నవి ఈ కలియుగ విధ్వంసాలు
చెట్లు నరుకుట , కలుషిత నీరు ,కాలుష్యమే ఫైరు
గాలిలో మేడలు ,అణు పరీక్షలు ,గనుల తవ్వకాలు
విద్యుత్ ప్రాజెక్టులు ,వ్యర్ధ పదార్ధాలు ,విరిగే కొండలు
మట్టిని మరచి మార్బుల్స్ , మూగజీవాల హంటింగ్స్
నాగరికతను విడచి కృత్రిమ జీవనంకై పరుగులు
వనారణ్యాలను ఖబ్జా చేసి స్మగ్లింగ్ దందాలు
మన ఎదగటమే ముఖ్యం మన చర్యలే ప్రకృతికి శాపం
రోదిస్తోంది ఆకాశం ప్రకృతి విలయతాండవం చూసి
కన్నెర్ర చేసింది కాశ్మీరం మన కార్య కలాపాలను కాంచి
అమ్మ ఒడి లాంటిదిరా ప్రకృతి పాడుచేయకు
సోమ్ములకోసం ఆశపడి ప్రకృతిని అమ్ముకోకు
అందంగా ఉంచావో అది పర్యావరణం లేకుంటే రణం
సహజ వనరుల నిక్షేపం అది మార్చకు దాని ఆకృతి
పర్యావరణ క్షేమమే ప్రజా సంక్షేమము ,దేశ సౌభాగ్యము
0 comments:
Post a Comment