Wednesday 25 November 2015

కవిత నెం 207:నాడు -నేడు 'దేశం ' లో

కవిత నెం :207

నాడు -నేడు 'దేశం ' లో 

ఒకప్పుడు 
దేశ స్వాతంత్రం కోసం 
మన స్వేచ్చ కోసం 
ఓడారు ,పోరాడారు -గెలిచారు 

అన్ని కులాలు 
అన్ని మతాలు 
అన్ని గ్రామాలు 
ఒక్కటిగా ,సమిష్టిగా -నిలచారు 

ఆత్మ విశ్వాసంతో ,
గుండె ధైర్యంతో ,
రొమ్ము విరచి ,
శత్రువుల  వెన్ను - విరగగొట్టారు 

పరాయివాళ్ల పాలనలో 
సమాది అవుతున్న 
మన దేశ సమైక్త్యతని 
స్వార్ధపరుల నుంచి - రక్షించారు 

మరి ఆ స్వేచ్చ ,స్వాతంత్రం మన సొంతమయ్యాక 
మనం చేసిన మంచి ఏమి ?
మనవళ్ల దేశానికి ఉపయోగమేమి ?

నీ స్వార్ధం 
నీ లోభం 
నీకు నువ్వే ప్రలోభం 

లేదు న్యాయం 
లేదు ధర్మం 
న్యాయ దేవతకే అంధకారం 

మన వాళ్లే 
మన ప్రజలే 
మన దేశమే 
అని ఆలోచన ఎవ్వరికి ?

దొరికినదా దోచుకో 
నీ కీర్తిని పెంచుకో 
నీ కోరిక కోసం 
మానవ ధర్మాన్ని మరచిపో 

ప్రజాస్వామ్యం అంటూ 
రోజుకొక్క పార్టీ పెడుతూ 
నీ పాలనే నిలవాలి అంటూ 
ఎందుకు రాజకీయం ?

ఉన్మాదం 
ఉగ్రవాదం 
పడగ నీడలో 
మన దేశం ఇరుకున పడుతుంటే 

నీ మతం - నీ కులం 
నీ పార్టీ - నా పార్టీ
ఐకమత్యం లేక 
ఒంటరిగా నువ్వు సాగితే 

ఏది రక్షణ 
ఎక్కడుంది దుష్ట శిక్షణ 
అబాగ్యులు 
అమాయకులు 
మన ప్రజలు 
ఆ వినాశనంలో కొట్టుకుపోతే 

రండి కలిసి రండి 
ఒక్కటిగా ఉండండి 
ఎవ్వరికీ ఇవ్వొద్దు అవకాశం 
మన ప్రజలు - మన దేశం 
క్షేమమే -మన దేశ సౌభాగ్యం  









0 comments:

Post a Comment