Wednesday 13 May 2015

కవిత నెం150:హనుమాన్ జయంతి


కవిత నెం :150
హనుమాన్ జయంతి

"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం. 
మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు
ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం
ఎంతటి ఉపద్రవాల నుండైనా కాపాడే ఆపద్బాందవుడు 
కలలో కలవరించినా చాలు ,చింతను పోగొట్టే కరుణామూర్తి . 
అయన నామస్మరణ చాలు సర్వ దుఃఖ పరిహారం 
ఆయన మనసు మానవ సరోవరం 
ఆయన తేజస్సు హిమాలయం 
ఆయన రూపం భజే రుద్రరూపం 
ఆయన శౌర్యం ప్రభాదివ్యకావ్యం 
విజయాన్ని కలిగించే వీరాంజనేయుడు 
పిలిస్తే పలికే ప్రసన్నాంజనేయుడు 
అనంత శక్తి కలిగి యున్నవాడు ఆంజనేయుడు 
మరణాన్ని గెలిచిన సంజీవుడు ,చిరంజీవుడు 
నమ్మిన చాలు నీడలా తోడుండువాడు 

శ్రీరామునికి నమ్మిన బంటు ,మహా భక్తుడు 
నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. 
అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది. 

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము. ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది.

0 comments:

Post a Comment