29, సెప్టెంబర్ 2014, సోమవారం

కవిత నెం50:మహిషాసురమర్దిని


కవిత నెం :50
మహిషాసురమర్దిని
********************
 రంభుడు అనే రాక్షసుణి పుత్రుడు మహిషుడు 
 బ్రహ్మ వరంతో వరగర్వితుడై లోక కంటకుడయ్యాడు 
 మదబలముతో దేవేంద్రుని ఓడించి ఇంద్రపదవినొందాడు 
 మహిషునిపై పుట్టిన క్రోదాగ్ని తేజముగా ఉద్భవించే
ఆ త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై స్త్రీ రూపముగా జన్మించే
శివుని తేజము ముఖముగా ,విష్ణు తేజము భాహువులుగా
బ్రహ్మ తేజము పాదములుగా - దుర్గా దేవిగా అవతరించే
పద్మా సనస్థయైన ఆ తేజో : పుంజరూపిణికి
సర్వదేవతలు సమస్తాయుదాలను సమకూర్చే
లోకాలు అదిరేలా హూంకార ధ్వని చేస్తూ దేవి కదిలే 
సింహసనేశ్వరియై గర్జిస్తూ ఘీంకరిస్తూ సాగే 
 ప్రళయాగ్ని ని  చిందిస్తూ ఘోరముగా యుద్ధం చేసే 
రౌద్ర రూపం దాల్చి మహిషాసురుణ్ణి సంహరించే 
మహిషుని చంపగా తానూ మహిశాసురమర్దినిగా 
బెజవాడ ''ఇంద్ర కీలాద్రి'' పై దుర్గా దేవిగా అవతరించే 
ఆదిశంకరులు మహిషాసురమర్దిని స్తోత్రముతో 
నిత్యం అయిగిరి నందిని గా పూజలు అందుకొనుచుండే 
జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే 
పాహిమాం పాహిమాం దేవి సర్వ భగవతీ నమోస్తుతే 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి